Sunday, April 28, 2024

మహరాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

పుణె: మహరాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పుణె జిల్లా పింప్రి-చించ్వాడ్ లోని పూర్నానగర్ లో బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో రెసిడెన్షియల్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎలక్ట్రిక్ హార్డ్ వేర్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి.

మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి వేగంగా వ్యాపించడంతో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News