ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ బెల్లంకొండ మూడో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా చేస్తున్న తొలి రెండు చిత్రాల షూటింగ్ తుది దశకు చేరుకున్నాయి. ఎస్వి2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై తొలి చిత్రంగా ‘నాంది’ వంటి డిఫరెంట్ మూవీని నిర్మించి.. సూపర్ హిట్ కొట్టి అభిరుచి గల నిర్మాతగా నిరూపించుకున్న సతీష్ వర్మ తన బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా గణేష్ బెల్లంకొండ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు తేజ శిష్యుడు రాకేష్ ఉప్పలపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ న్యూ ఏజ్ థ్రిల్లర్కు రాకేష్ స్క్రీన్ప్లే రాయగా, కథను అందించిన ప్రముఖ రచయిత కృష్ణచైతన్య మాటలు, పాటలను కూడా రాస్తున్నారు.
సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్రాజు క్లాప్ కొట్టగా హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచాన్ చేశారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అనిత్ సినిమాటోగ్రాఫర్. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్. ఈ చిత్రానికి ఆర్ట్ః శ్రీ నాగేంద్ర తంగల, ఫైట్స్ః రామకృష్ణ.