Sunday, April 28, 2024

బిజెపికి అవకాశం ఇవ్వండి : రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : బంగారు తెలంగాణ పేరుతో బిఆర్‌ఎస్ ప్రజలను మోసం చేసిందని..ఈ సారి బిజెపికి అవకాశం ఇవ్వాలని ప్రజలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. కరీంనగర్‌లో మహాశక్తి దేవాలయాన్ని రాజాసింగ్, బండి సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నా సస్పెన్షన్ ఎత్తివేసినందుకు పార్టీకి ధన్యవాదాలన్నారు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని బిఆర్‌ఎస్‌ను తరిమేయ్యాలని సంకల్పం తీసుకున్నామని తెలిపారు. పద్నాలుగు నెలల పాటు పార్టీకి దూరంగా ఉన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి బిజెపికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా బండి సంజయ్ ని గెలిపించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News