Monday, May 13, 2024

చింతంపల్లిలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించిన గోద్రెజ్ ఆగ్రోవెట్..

- Advertisement -
- Advertisement -

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) కింద ‘మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్’ను ప్రారంభించింది. వంట నూనెల ఉత్పత్తిలో మన దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకువెళ్లే లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును మరింత ప్రోత్సహించడం, పెంచడం దీని లక్ష్యం. ఈ కారణానికి మద్దతు అందిస్తూ, విభిన్నమైన వ్యవసాయ-వ్యాపార సంస్థ అయిన గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ (GAVL) ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని చింతంపల్లిలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్‌ను నిర్వహించింది.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 200 మంది చొప్పున రైతులు ఈ కార్యక్రమం లో భాగస్వాములు కావటం తో పాటుగా, భారత ప్రభుత్వ వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ కమిషనర్ డాక్టర్. పి.కె. సింగ్, ఏలూరు, (ఆంధ్రప్రదేశ్) పార్లమెంటు సభ్యుడు, కోటగిరి శ్రీధర్; Dr. కె సురేష్, డైరెక్టర్, ICAR- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ (IIOPR), సౌగత నియోగి, సీఈఓ -ఆయిల్ పామ్ బిజినెస్, GAVL. కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారు, పామాయిల్ యొక్క 2వ అతిపెద్ద వినియోగదారు. 300,000 టన్నుల స్థానిక ఉత్పత్తితో, దేశం ప్రస్తుతం 7,500,000 టన్నులను దిగుమతి చేసుకుంటోంది.
దేశవ్యాప్త మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్‌పై భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యవసాయ కమిషనర్ డాక్టర్. పి.కె.సింగ్ మాట్లాడుతూ, “వర్షాకాలానికి సంబంధించిన ప్లాంటేషన్ డ్రైవ్‌కు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కంపెనీలు, రైతులు నుండి ప్రోత్సాహకరమైన స్పందన లభించింది. సుమారు 3500 హెక్టార్లలో విస్తరించి ఉన్న ప్రాంతంలో దాదాపు 5.00 లక్షలకు పైగా మొక్కలు నాటడం ఈ డ్రైవ్ లో చేయనున్నాము, ఇది 2025-26 నాటికి ఆయిల్ పామ్ ఉత్పత్తి కింద 6.5 లక్షల హెక్టార్ల అదనపు విస్తీర్ణాన్ని తీసుకురావాలనే లక్ష్యాన్ని సాధించడంలో మాకు మరింత సహాయం చేస్తుంది. గోద్రెజ్ వంటి సంస్థ లతో కలిసి, ఆయిల్ పామ్ రైతులకు ఉత్పాదకతను పెంపొందించడం, స్థిరమైన ఆదాయ వనరులను సృష్టించడంపై మాకు నమ్మకం ఉంది..” అని అన్నారు .

ఏలూరు (ఆంధ్ర ప్రదేశ్) పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడు, కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ రైతులకు మంచి ధరలను అందించటానికి దిగుమతి సుంకం పెంపు యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, ఇది ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి సహాయపడుతుందన్నారు.

GAVL సీఈఓ -ఆయిల్ పామ్ బిజినెస్ సౌగత నియోగి మాట్లాడుతూ.. “GAVL వద్ద, స్థిరమైన, బాధ్యతాయుతమైన ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ డ్రైవ్ ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిలో స్వావలంబన సాధించడానికి మరియు వ్యవసాయ సమాజాన్ని ఉద్ధరించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు గా నిలుస్తుంది. 10 రాష్ట్రాల్లోని 20 జిల్లాల్లో 2.5 లక్షల కంటే ఎక్కువ ఆయిల్ పామ్ మొక్కలను పంపిణీ చేయడం ద్వారా, మేము ఆయిల్ పామ్ రైతులకు మా 30 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవాన్ని అందించడం ద్వారా వారికి స్థిరమైన ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పద్ధతులపై శిక్షణ ఇవ్వడంతో పాటు అనేక వనరులను అందించడం కొనసాగిస్తాము. ఆయిల్ పామ్ రైతుల కోసం మా వన్-స్టాప్ సొల్యూషన్ సెంటర్ అయిన సమాధాన్ ద్వారా, మేము భారతీయ ఆయిల్ పామ్ రైతులను చిన్న భూములతో ఉద్ధరించడమే కాకుండా వారి ప్రాంతంలో ఉపాధిని కూడా సృష్టిస్తామని మేము విశ్వసిస్తున్నాము…” అని అన్నారు.
స్థానిక పర్యావరణ వ్యవస్థ మరియు పర్యావరణంపై ఆయిల్ పామ్ పెంపకం యొక్క ప్రభావాన్ని వెల్లడించిన , ICAR-IIOPR డైరెక్టర్ డాక్టర్ కె. సురేష్ మాట్లాడుతూ, “అత్యధిక శాకాహార వంట నూనె దిగుబడినిచ్చే పంటగా, ఆయిల్ పామ్ సాగు రైతులకు అదనపు ఆదాయ వనరులను కలిగిస్తుంది. అంతర పంటలు మరియు వారి అభివృద్ధి ప్రాంతంలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు. ఈ పంట ఇతర తోటల పంటల కంటే ఎక్కువ కార్బన్‌ను సీక్వెస్టర్ చేస్తుంది మరియు పర్యావరణంపై కూడా ప్రభావం చూపదు. ఈ ప్లాంటేషన్ డ్రైవ్ వంటి కార్యక్రమాలతో ఆయిల్ పామ్ వాటాదారుల మధ్య సహకార ప్రయత్నాలను చూసి నేను సంతోషిస్తున్నాను, ఇందులో శాకాహార నూనె ఉత్పత్తిలో ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడంలో మరియు భారతదేశ ఆర్థిక వృద్ధిని సాధించడంలో వంట నూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం అనే ఉమ్మడి లక్ష్యంపై మనమందరం దృష్టి కేంద్రీకరించాము” అని అన్నారు.

ఇటీవల, GAVL ఏలూరు జిల్లా చింతలపూడిలో ఒక ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీని ప్రారంభించింది, ఇది విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం దాని మొదటి డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్. ఆయిల్ పామ్ సాగును విస్తరించడానికి, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడానికి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో 47,000 ఎకరాల భూమిని కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News