Thursday, May 2, 2024

ప్రభుత్వ ఉద్యోగి ఆరోగ్యంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

Government Employee

 

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగి ఆరోగ్యంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగుల క్రీడోత్సవాలను మంత్రి ప్రారంభించారు. టిఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేనీ ఆధ్వర్యంలో 2020 క్రీడోత్సవాలు సోమవారం ఎల్‌బి స్టేడియంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రితో పాటు బేవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్, సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు ముందుండాలనీ, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ప్రతి ఉద్యోగి నిత్యం వ్యాయామంతో పాటు క్రీడల్లోనూ పాల్గొనాలని మంత్రి పేర్కొన్నారు.

దీనివల్ల శరీరం దృఢంగా మారుతుందని, శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉంటారని మంత్రి తెలిపారు. క్రీడల్లో పాల్గొన్న ఉద్యోగులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్‌సిసి క్యాడెట్స్ ఆజాన్ హైస్కూల్ పిల్లలు మార్చ్ ఫాస్ట్ చేశారు. కార్యక్ర మంలో భాగంగా పోలీస్ బ్యాండ్ అందరినీ ఆకట్టుకుంది. పురుషులకు, మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఉద్యోగులకు భోజన సదుపాయాన్ని కల్పించారు. ఇండోర్ స్టేడియంలో మహిళలకు షెటిల్ బ్యాడ్మింటిన్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ పోటీలను, పురుషులకు కబడ్డీ, వాలీబాల్, షెటిల్ బ్యాడ్మింటెన్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ ఆటలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, బి.రేచల్, రామినేని శ్రీనివాస్‌రావు, ప్రతాప్, ఖాదర్‌బిన్, యుసుఫ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Government Employee must be Healthy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News