Sunday, May 19, 2024

వందల మంది రేవణ్ణ బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

బెళగావి : మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వందల మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ , ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా ఈ విషయాన్నివెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య , ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల సమక్షంలో ఈ ప్రకటన చేశారు.

‘ బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. వారికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య నిర్ణయించారు. ఇది భిన్నమైన కేసు గడిచిన 75 ఏళ్లలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదు’ అని సుర్జేవాలా వెల్లడించారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాందీ కూడా డిమాండ్ చేశారన్నారు. బీజేపీ కూటమిలో జేడీఎస్ ఉన్నందున , వారిని రక్షించేందుకు ప్రధాని మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజ్వల్‌కు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేపీని ప్రశ్నించారు.

ప్రజ్వల్ దేశం విడిచి పారిపోకుండా విదేశాంగ శాఖ ఎందుకు అడ్డుకోలేక పోయిందని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. నిందితుడికి ఉన్న దౌత్య పాస్‌పోర్టును ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, అతడిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇంటర్ పోల్ ద్వారా నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్నారు. సిఎం సిద్ధ రామయ్య మాట్లాడుతూ ప్రజ్వల్‌ను స్వదేశానికి రప్పించేందుకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News