- Advertisement -
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ మృతిని మావోయిస్టులు ధృవీకరించారు. సారక్క అలియాస్ భారతక్క కూడా చనిపోయినట్టు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడదలైంది. ఈ నెల 21న హరిభూషణ్, 22న సారక్క చనిపోయారని మావోయిస్టులు ప్రకటించారు. 22న అంత్యక్రియలు నిర్వహించామన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మడగూడెెం గ్రామానికి చెందిన హరిభూషణ్ 1995లో పీపుల్స్వార్ గెరిల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ కమిటీ కార్యదర్శిగా కీలకపాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ-, చత్తీసగఢ్ సరిహద్దుల్లో జరిగిన అనేక ఆపరేషన్స్లో కీలక పాత్ర పోషించాడు.
- Advertisement -