Sunday, May 5, 2024

రూ.10 వేలు పంట నష్ట పరిహారం: హరీష్ రావు

- Advertisement -
సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వంలో అధిక వర్షాలు వస్తే ఎప్పుడో ఎకరానికి 2 వేల రూపాయలు సాయం అనేది ఇస్తే అవి వస్తాయో రావో తెలియని పరిస్థితిల్లో రైతులు వుండేవాళ్ళు అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డిలో అకాల వర్షాలతో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 4 వేల 300 ఎకరాలలో పంట నష్టానికి 4 కోట్ల 5 లక్షల రూపాయలను 393 మంది రైతులకు నష్టపరిహారం డబ్బు నేరుగా ఆయా బ్యాంకుల వెబ్ సైట్ నుంచి మీట నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
బిఆర్ఎస్ తోనే రైతులకు భరోసా, కెసిఆర్ తోనే రైతన్నకు దిలాసా అని చెప్పారు.  కాని తెలంగాణ రైతు ప్రభుత్వం ఎకరానికి 10 వేల చొప్పున నష్టపోయిన ప్రతి రైతు ఖాతాలో వేస్తున్నామని,  రూ 99 వేల పంట రుణాలు మాఫీకి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం రైతులకు విడుదల చేయనుందన్నారు. మరో పక్షం రోజుల్లో రూ.లక్ష ఆపై ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు విడుదల చేయబోతున్నామని,  రేవంత్ రెడ్డి 3 గంటలు రైతులకు చాలు అంటున్నారని, వారికి రైతులే సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ అంటే యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్ లో పెట్టిన ప్రభుత్వం తమది కాదని, కెసిఆర్ రుణమాఫీ చేయడనుకొని ధర్నా చేద్దాం అనుకున్న కాంగ్రెస్ వాళ్లకు రైతులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ధరణితో రైతులకు తమ భూములపై పూర్తిగా సర్వాధికారాలు వచ్చాయని, ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ మళ్ళీ బ్రోకర్ల రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. సంగమేశ్వర ప్రాజెక్ట్ తో వర్షాలు వచ్చినా రాకపోయినా సంగారెడ్డి జిల్లాలో పంటపొలాలు సస్యశ్యామలంగా ఉన్నాయని ప్రశంసించారు. మూడు గంటల కరెంటు ఇస్తామనే కాంగ్రెస్ కావాలో.. బాయిలకాడ మీటర్లు పెడతామన్న బిజెపి కావాలో… మూడు పంటల 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన సిఎం కెసిఆర్ కావాలో రైతులే నిర్ణయం తీసుకోవాలన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News