Monday, April 29, 2024

సమగ్ర శిక్ష ఉద్యోగుల పెండింగ్ జీతాలను చెల్లించాలి:హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం మాట తప్పిందని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా విమర్శించారు.గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల నుండి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట ఛార్జీలు, కోడిగుడ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News