Thursday, May 2, 2024

‘కాంగ్రెస్ పాలనలో రన్నో మనకు కన్నీళ్లే మిగిలాయిరన్నో’

- Advertisement -
- Advertisement -

సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డు లేని దోపిడీని చూసి ఆగ్రహించి పాట రాయని కవి లేడు అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పాలనమీద ప్రజాయుద్ధ నౌక, దివంగత గద్దర్ రాసిన పాట అసెంబ్లీలో పాడి హరీష్ రావు వినిపించారు.  నీటిపారుదల రంగం శ్వేతపత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది.

1. కాంగ్రెస్ పాలనలో రన్నో మనకు కన్నీళ్లే మిగిలాయిరన్నోగోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది. కృష్ణమ్మ తల్లిరా కన్నీల్లు రాల్చింది. సింగరేణి తల్లి సిన్న బోయినాది. సిక్స్ టెన్ జీవో నేమో జీరో అయ్యినాది. అని కాంగ్రెస్ దుర్మార్గపు దాష్టికాల గురించి ప్రజా యుద్ధ నౌక గద్దర్ రాసిన్రు అధ్యక్షా..

2. ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి దక్సిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి నీళ్లు లేక నోళ్లు తెరిచె బీళ్లను చూడు మా పల్లెలన్నీ బోసిపోగ తల్లడిల్లుతున్న తల్లీ చూడు తెలంగాణ, చుక్క లేని నీళ్లు లేని దాన మా గోడు తెలంగాణ, బతుకు పాడైన దాన.. అని అందెశ్రీ గారు కాంగ్రెస్ పాపిష్టి పరిపాలనను శపిస్తూ రాసినారు.

3. మరో కవి జయరాజు గారు.. వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ.. చేలల్ల నీళ్లు లేవు, చెలకల్ల నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కండ్లల్ల నీళ్ళు లేవు.. అని హృదయం ద్రవించి పోయేలా రాసారు.

కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని తెలంగాణ కవి లేడు, గళమెత్తని తెలంగాణ గాయకుడు లేడు. ఇట్ల చెప్పుకుంటు పోతే రేపటి దాక చెప్పచ్చు అధ్యక్షా అని హరీష్ తన ప్రసంగాన్ని ముగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News