ముంబయి: తల, కాళ్లు లేని మహిళ మొండెం లభించిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని విద్య విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవల్ గేట్ సమీపంలో తల లేని మొండెం గల మృతదేహం కనిపించడంతో పాదచారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెడ్ షీట్లో కాళ్లు, తల లేని మొండెం గల నైటీతో ఉన్న మహిళ (30) మృతదేహంగా గుర్తించారు. స్థానిక మహిళ మృతదేహం కాకపోవచ్చని వేరే ప్రదేశాలలో హత్య చేసి విద్య విహార్ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. విద్య విహార్ లో ఉన్న సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని డిసిపి అఖిలేష్ సింగ్ తెలిపాడు. ఒక్క డిసెంబర్ లోనే మొండెం లేని మూడు మృతదేహాలు ముంబయి నగరంలో కనిపించడం కలకలం సృష్టిస్తోంది. డిసెంబర్ 2న తల లేని మొండెం ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కనిపించిన సంఘటన అరేబియన్ సముద్ర తీరంలో మహిమ్ దర్గాహ ప్రదేశంలో చోటుచేసుకుంది. దర్యాప్తులో భాగంగా మొండెం బెనట్ట్ రెబెల్లోదిగా గుర్తించారు. ఓ యువతిని రెబెల్లో లైంగికంగా వేధిస్తుండడంతో ఆమె తన లవర్ సహాయంతో అతడిని హత్య చేసి మొండెమును అరేబియన్ సముద్రంలో పడేశారు. రెండో ఘటన తల లేని మొండెమును బస్తాలో పెట్టి చాంబుర్ ప్రాంతంలో పడేశారు. ఆ మొండెం దేవేంద్ర అఖేడ్గా గుర్తించారు. దేవేంద్ర ప్రతి రోజు మద్యం సేవించి భార్యను వేధిస్తుండడంతో తన తమ్ముడితో కలిసి భర్తను హత్య చేసినట్టు పోలీస్ దర్యాప్తులో తేలింది.