చెన్నై: బుల్లితెర నటి తన మాజీ ప్రియుడిని హత్య చేసిన సంఘటన సోమవారం తమిళనాడులోని కోళాతార్ ప్రాంతంలో జరిగింది. ఈ కేసులో బుల్లి తెర నటితో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎనిమిది సంవత్సరాల క్రితం మదురైకు చెందిన రవి చెన్నైలో పని చేసేవాడు. చిన్న చిన్న సిరియల్స్లో నటించే దేవితో రవికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కానీ తరువాత శంకర్ అనే వ్యక్తిని దేవి వివాహం చేసుకున్నప్పటి నుంచి రవిని దూరం పెట్టింది. కానీ దేవి కోసం రవి వెతకడం ప్రారంభించారు. కోళాతుర్లో దేవీ చెల్లెలు లక్ష్మి రవికి కనిపించింది. లక్ష్మి ఇంటికి వెళ్లిన రవి దేవీతో కలిసి ఉంటానని తెలిపాడు. వెంటనే లక్ష్మి తన అక్క దేవి, బావ శంకర్ కు ఫోన్ చేసింది. అక్కడికి వచ్చిన లక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగిస్తానని రవి తెలిపాడు. వెంటనే కోపంతో ఊగిపోయిన దేవి కర్ర తీసుకొని రవి తలపై బలంగా మోదింది. రవి కింద పడిపోగానే సుత్తి తీసుకొని పలుమార్లు తలపై బాదింది. వెంటనే దేవి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దేవి, శంకర్, లక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.