Friday, May 3, 2024

ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాద్ : సుదీర్ఘకాలంగా నలుగుతున్న ఎస్‌సి వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సిజెఐ చంద్రచూడ్ రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. పంజాబ్ వర్సెస్ దేవీందర్ సింగ్ కేసుకు జత చేస్తూ సిజెఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

వాదనల సందర్భంగా ఎస్‌సి లలో మాదిగ సామాజిక వర్గం అత్యంత వెనుకబడి ఉందని పిటిషనర్ తెలిపారు. రిజర్వేషన్ ఫలాలు మాదిగలకు సక్రమంగా అందడంలేదని కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందిస్తూ పంజాబ్ వర్సెస్ దేవీందర్ కేసు విస్తృత ధర్మాసనం ఎదుట ఉందని సిజెఐ తెలిపారు. అది కూడా రిజర్వేషన్ల వర్గీకరణకు చెందిన అంశం కావడంతో, ఎమ్మార్పీఎస్ పిటిషన్‌ను ఆ కేసుకు జత చేస్తున్నామని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News