Friday, May 3, 2024

రాగల రెండు రోజులు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాగల రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేఅవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలపై ఉంటుందని తెలిపింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం నుంచి బుధవారం వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వివరించింది.

రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 77.3 మి.మీ కాగా, శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 150.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతంతో పోలిస్తే 95 శాతం అధికమని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరిలో 211 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 61.5 మి.మీ. కాగా 191.3 మి.మీ. వర్షపాతం అధికంగా నమోదైంది. కాగా, పలు చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాధారణ వర్షపాతం 95 మి.మీ కాగా, 74.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇది 21 శాతం తక్కువ. అదే విధంగా వరంగల్‌లో సాధారణ వర్షపాతం 96 మి.మీ. కాగా 81.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇది 15 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News