చెన్నై: తమిళ స్టార్ నటుడు అజిత్ గురించి పరిచయం అవసరం లేదు. తమిళనాడుతో పాటు తెలుగురాష్ట్రాల్లో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అజిత్ పద్మభూషన్ అవార్డును అందుకున్నారు. దీంతో ఆయన సంబరాల్లో మునిగిపోయిన ఆయన ఫ్యాన్స్కి తాజాగా చేధు వార్త అందింది. అదేంటంటే.. బుధవారం అజిత్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయన ఫ్యాన్స్ తమ అభిమాన నటుడుకి ఏమైదని కంగారు పడుతున్నారు. అయితే అజిత్కు ఏం కాలేదని.. ఆయన పిఆర్ టీం ప్రకటించింది.
పద్మ అవార్డు అందుకున్న అజిత్.. మంగళవారం తిరిగి చెన్నైకి వచ్చిన సమయంలో ఫ్యాన్స్ ఆయన్ను అభినందించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఎయిర్పోర్టులో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో అజిత్ కాలికి స్వల్ప గాయమైందని తెలుస్తోంది. ఈ గాయానికి చికిత్స పొందేందుకే అజిత్ ఆస్పత్రిలో చేరారని.. చికిత్స అయిపోయిన వెంటనే ఆయన్ను డిశ్చార్జి చేస్తారని అజిత్ టీం వెల్లడించింది.