హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చేస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించిన జార్జిరెడ్డి ఫేమ్ సందీప్ మాదవ్ మంగళవారం జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి మోతినగర్ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరో సందీప్ మాదవ్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటలన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఒక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని దానిలో నేను కూడా భాగస్వామ్యంమై మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.
భవిష్యత్తులో సంతోష్ కుమార్ ఏ కార్యక్రమం చేపట్టినా నేను తోడుగా ఉంటానని తెలిపారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మాట్లాడుతూ చేయి చేయి కలిపి కలిసికట్టుగా సాగితే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని, సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కూడా అదే తరహా ముందుకు సాగుతోందన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరం మరింత గ్రీన్ సిటీగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోపౌండర్ రాఘువ, ప్రతినిధి కిషోర్ గౌడ్, కాలనీ అధ్యక్షులు ఇందర్సింగ్తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.
మరో నలుగురికి గ్రీన్ ఛాలెంజ్…
సినీ హీరో సందీప్ మంగళవారంమరో నలుగురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.డైరెక్టర్ జీవన్రెడ్డి, హిరోయిన్లు నయన గంగూలీ, కుంప్ చాందిని నటుడు శత్రువులకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన సందీప్ మొక్కలు నాటాలని కోరారు.
Hero Sandeep Madhav accepts mangli green challenge