Friday, September 19, 2025

యాప్ డిజైన్ హబ్

- Advertisement -
- Advertisement -

ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్ గ్లోబల్ సెంటర్ డిజైన్ అనేది సామాజిక
మార్పునకు ఆయుధం కావాలి యుఎక్స్ ఇండియా -25 అంతర్జాతీయ
సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలో సెంటర్ ఆఫ్
ఎక్స్‌లెన్స్ ఇన్ డిజైన్: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

మన తెలంగాణ/ హైదరాబాద్ : యాప్ డిజైన్ లీడర్ గా హైదరాబాద్ ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యుఎంఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం హైటెక్ సిటీ లో ఒక హోటల్లో జరిగిన ‘యుఎక్స్ ఇండియా–25‘ పేరిట ఏర్పాటు చేసిన 21వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూజర్ ఎక్స్పీరియన్స్ మరియు ప్రోడక్ట్ డిజైన్‘ ను ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ,హైదరాబాద్ నగరం ఎటువంటి టెక్నాలజీ నైనా అందిపుచ్చుకొని లీడర్ గా ఎదుగుతుందన్నారు. ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్‌ను గ్లోబల్ సెంటర్ గా నిలబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రతినిధులు హైదరాబాద్ వాతావరణం, సంస్కృతి, కళలు, ఆహారం అన్నిటిని ఆస్వాదించాలని, ప్రతినిధులు ఈ రాష్ట్రంలో ప్రధానంగా టెక్నాలజీ రంగంలో గుర్తించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని హాజరైన ప్రతినిధులను డిప్యూటీ సీఎం కోరా రు.

డిజైన్ అనేది కేవలం కళ్లకు అందంగా కనిపించడం కాదు అది సామాజిక మార్పునకు ఆయుధం కావాలని అన్నారు. తమ ప్రభుత్వం సమానత్వం, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. హైదరాబాదును ప్రపంచ డిజైన్ క్యాపిటల్ గా మార్చడానికి కలిసి పని చేద్దామని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఈ అంతర్జాతీయ సద స్సు హైదరాబాద్ చరిత్రలో ఒక మలుపు రాయి అన్నా రు. తెలంగాణ రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తును పరిపుష్టం చేయడంలో, మరో అడుగు ముందుకు వేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అశాభావం వ్యక్తం చేసారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు మన జీవితాల్లో అనివార్యమైనవి, కానీ ఒక యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటేనే అది విజయవంతం అవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ ఇంక్లూజన్ను ప్రోత్సహిస్తుంది, టీఎస్ ఐపాస్ వంటి పాలసీల ద్వారా స్టార్టప్ లకు చేయూతను ఇస్తోందని భట్టి వివరించారు. భారతదేశంలో యూపీఐ వంటి యాప్ లు సరళంగా రూపొందించడంతో పెద్ద విజయం సాధించాయని అన్నారు. ప్రాంతీయ భాషల్లోనూ యాప్ లు రూపొందించడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అన్నారు.

త్వరలో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ డిజైన్’: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ ను గ్లోబల్ డిజైన్ హబ్ గా మార్చాలనే సంకల్పంతో త్వరలోనే ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ డిజైన్‘ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. టీ హబ్, టీ వర్క్, వీ హబ్ లాంటి సంస్థల ద్వారా తెలంగాణను ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ‘ఏఐ ఇన్నోవేషన్ హబ్ ‘లో డిజైనింగ్ కు పెద్దపీట వేస్తున్నామన్నారు. డిజైనింగ్ అంటేనే సృజనాత్మకత అని, కాకపోతే… ఆది యూజర్ ఫ్రెండ్లీ గా ఉండాలన్నారు. అప్పుడే ఆ యాప్ లేదా వెబ్ సైట్ మనుగడ సాధ్యం అన్నారు. ఈ ప్రక్రియలో ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వల్ల ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా చూడాలని సూచించారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే అంకుర సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు.

Also Read: హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు..నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది: కిషన్‌రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News