Monday, May 13, 2024

హైదరాబాద్ ను యుటి చేయం: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Pvt security guards big role to play in vaccine drive

 

హైదరాబాద్: దేశంలో ఏ ప్రాంతాన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతం చేయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టబధ్రుల ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందని ఎంపి అసదుద్దీన్ ఓవైసి అన్న మాటాలకు కిషన్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. తాను సమాధానం చెప్పే లోపు ఓవైసి సభ నుంచి వెళ్లిపోయారన్నారు. హైదరాబాద్ సహా దేశంలో ఉన్న అన్ని నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు. రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాలు బిజెపి గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News