Monday, May 13, 2024

దేశంలో మరో 2,40,842 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

India reports 240842 new Covid-19 cases

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 2,40,842 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,55,102 డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరో 3,741 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 2,65,30,132కి చేరాయి. దేశంలో ఇప్పటివరకు 2,34,25,467 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో మొత్తం మరణాల సంఖ్య 2,99,266కి పెరిగింది. భారత్ లో ప్రస్తుతం 28,05,399 క్రియాశీల కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం  19,50,04,184 మందికి కరోనా టీకాలు వేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. కాగా, 2021 మే 22 వరకు 32,86,07,937 మంది కరోనా నమూనాలను పరీక్షించారు. వీటిలో 21,23,782 మందికి టెస్టులు చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది.

India reports 240842 new Covid-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News