Monday, May 6, 2024

‘ఇంద్రజాలం’ ఆరంభం

- Advertisement -
- Advertisement -

ఇంద్రసేన హీరోగా జై క్రిష్ ప్రధాన పాత్రలో పూర్ణాస్ మీడియా సమర్పణలో నిఖిల్ కె. బాల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇంద్రజాలం’. బుధవారం ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో జరిగాయి. పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం ఇంటర్నేషనల్ ఆర్టిట్రేషన్ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ఆర్. మాధవరావు కెమెరా స్విచ్ఛాన్ చేయడంతో సినిమా ప్రారంభమై ంది.

Also Read: సిఎం కెసిఆర్ చెప్పిన మిడతల దండు కథ

ఈ సందర్భంగా హీరో ఇంద్రసేన మాట్లాడు తూ “నేను నటించిన శాసనసభ మూవీ గత డిసెంబర్‌లో విడుదలై నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూసిన నిఖిల్ ఈ చిత్రంలో నాకు అవకాశం కల్పించారు”అని అన్నారు. దర్శక, నిర్మాత నిఖిల్ మాట్లాడుతూ “క్రైమ్ థ్రిల్లర్‌తో కూడిన ప్రేమకథ ఇది. ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఫస్ట్ నుంచీ ఫుల్ కామెడీ ఉంటుంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. రెండు షెడ్యూల్స్‌లో సిని మా పూర్తవుతుంది. ఒక షెడ్యూల్ బొంబాయిలో, మరొకటి హైదరాబాద్‌లో చేస్తాం. జూలై మూడో వారం నుంచి షూట్‌కు వెళ్తాము”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News