Thursday, May 2, 2024

జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలన

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయ భవన నిర్మాణ పనులను గురువారం మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం పరిశీలించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, కాంట్రాక్టర్‌ను, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సాధ్య మైనంత త్వరగా జిల్లా డిపిఓ కార్యాలయం పూర్తి చేయాలని, నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని మంత్రి తెలిపారు.

ఆగస్ట్టు చివరి నాటికి ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు కలెక్టరేట్, మెడికల్ కాలేజ్‌ను ప్రారంభించనున్నారని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్‌పి జె సురేందర్‌రెడ్డి, భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి, అదనపు ఎస్‌పి (ఏఆర్) వి శ్రీనివాసులు, భూపాలపల్లి డిఎస్‌పి ఏ రాములు, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకట్రాణి, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News