Monday, May 13, 2024

యథార్ఘ ఘటన ఆధారంగా

- Advertisement -
- Advertisement -

Interview with Heroine Amritha Aiyer

 

శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా తేజ మర్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అమృతా అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ… ‘అర్జున ఫల్గుణ’ సినిమా స్క్రిప్ట్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అన్ని రకాల జోనర్లు ఇందులో ఉంటాయి. ఈ సినిమాలో ఐదుగురు ఫ్రెండ్స్ మధ్యలో నేను ఒకరిని. ఫ్రెండ్స్‌కు కష్టం వస్తే సాయం చేసేందుకు ముందుకు వస్తాను. పరిస్థితులు అనుకూలించకపోయినా ఫ్రెండ్స్ కోసం నిలబడటమనే పాయింట్ బాగా నచ్చింది. అర్జున్ ఫల్గుణ అనేది విలేజ్ డ్రామా. రాజమండ్రిలో జరిగిన యథార్ఘ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. శ్రీ విష్ణుతో ఇదే మొదటి సినిమా. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. మేం ఇద్దరం నటించినట్టు ఉండదు.. యాక్షన్ రియాక్షన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది’ అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News