Thursday, May 2, 2024

చెలరేగిన కోల్‌కతా బౌలర్లు.. పంజాబ్‌ 123/9

- Advertisement -
- Advertisement -

IPL 2021: PBKS set up target 124 against KKR

అహ్మదాబాద్‌: ఐపిఎల్‌ 2021లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్ల దెబ్బకు పంజాబ్‌ కింగ్స్‌ బ్యాట్స్ మెన్లు విలవిల్లాడారు. దీంతో పంజాబ్ జట్టు కోల్‌కతాకు కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టుకు శుభారంభం దక్కినా కోల్‌కతా బౌలర్లు చెలరేగడంతో కనీసం గౌరవమైన స్కోరు కూడా చేయలేకపోయింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(31), కెఎల్ రాహుల్(19)లు మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్లే పెవిలియన్ కు క్యూ కట్టడంతో పంజాబ్ జట్టు 18.1 ఓవర్లలో 98 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రిస్ జోర్డన్(30 నాటౌట్) భారీ షాట్లతో చెలరేగడంతో పంజాబ్ వంద పరుగుల మైలురాయి దాటింది. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు.

IPL 2021: PBKS set up target 124 against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News