Thursday, May 2, 2024

IPL 2023: మెరిసిన ఇషాన్, సూర్య.. కోల్‌కతాపై ముంబై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 186 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్(20), ఇషాన్ కిషన్(58)లు ధనాధన్ షాట్లతో అలరించారు. ముఖ్యంగా ఈషాన్ భారీ సిక్సులతో కోల్‌కతా ఎదురుదాడి చేశాడు.

దీంతో ముంబై స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అనంతరం తిలక్ వర్మ(30), సూర్యకుమార్ యాదవ్(43), టిమ్ డేవిడ్(24)లు బ్యాట్ ఝుళిపించడంతో ముంబై 17.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో ముంబై, కోల్‌కతాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News