Saturday, July 27, 2024

IPL 2024: సొంతగడ్డపై బెంగళూరుకు ఓటమి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో ఓటమిని చవిచూసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. లక్నోకు ఇది వరుసగా రెండో గెలుపు కాగా, ఛాలెంజర్స్‌కు రెండో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

ఓపెనర్ డికాక్ 56 బంతుల్లో ఐదు సిక్సర్లు, 8 ఫోర్లతో 81, పూరన్ 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 40 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. మహిపాల్ లొమ్రర్ (33) ధాటిగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. మిగతావారిలో రజత్ పటిదార్ (29), విరాట్ కోహ్లి (22) మాత్రమే కాస్త రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ 14 పరుగులకే మూడు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News