Thursday, March 28, 2024

కెటిఆర్ కృషితో ఖమ్మంలో ఐటి హబ్: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

IT Hub established in Khammam by KTR

 

ఖమ్మం: ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కృషితో ఖమ్మంలో ఐటి హబ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మంలో ఐటి హబ్-2 నిర్మాణానికి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పువ్వాడ మీడియాతో మాట్లాడారు. అమెరికా, ఆస్ట్రేలియా కంపెనీలు ఖమ్మం వచ్చాయని, మరో 30 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడమే మంత్రి కెటిఆర్ లక్షమన్నారు. హైదరాబాద్‌ను దేశ ఐటి రాజధానిగా మార్చింది కెటిఆరేనని స్పష్టం చేశారు. మంత్రి కెటిఆర్ సహకారంతో ఖమ్మం ఐటి నగరంగా మారిందని పువ్వాడ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి నామా నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News