హైదరాబాద్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజిల్ యాక్షన్ డ్రామా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). జూన్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా (Kannappa) ఎలా తెరకెక్కించారో ఓ మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో సినిమాను రూపొందించేందుకు వాళ్లు పడిన కష్టాన్ని మనం చూడొచ్చు. ఈ వీడియోలో ప్రధాన తారగణం అందరూ కనిపించారు.
ఇక ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రభాస్, మోహన్బాబు, అక్షయ్ కుమార్, మోహన్లాల్, శరత్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఎవిఎ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఈ సినిమాని మోహన్బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు. మణిశర్మ, స్టీఫెన్ దేవస్సీ ఈ సినిమాకు సంగీతం అందించారు.