Friday, May 3, 2024

కెసిఆర్ త్వరగా కోలుకోవాలి : రామోజీ రావు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరగా కోలుకోవాలని రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీ రావు ఆకాంక్షించారు. త్వరగా కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం అవుతారని రామోజీ రావు ఆకాంక్షించారు. ఈ మేరకు కెసిఆర్ కుమారుడు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు రామోజీరావు శనివారం లేఖ రాశారు. కెసిఆర్ తన వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని సాఫల్యం పొందారని, ఈ సవాలును ఆయన అవలీలగా అధిగస్తారని లేఖలో పేర్కొన్నారు. కొన్ని వారాల విశ్రాంతి అవసరమైనా అనతికాలంలోనే కోలుకుని ప్రజాసేవకు రెట్టించిన ఉత్సాహంతో పునరంకితమవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News