Tuesday, April 30, 2024

అంచనాలను పెంచిన ‘పెంగ్విన్’ టీజర్..

- Advertisement -
- Advertisement -

 

‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పెంగ్విన్’. ‘పేట’ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీని యంగ్ డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదల కానున్న ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పట్లో థీయేటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో ఈ మూవీని చిత్రయూనిట్ జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రమోషన్ లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు టీజర్‌ని సమంత, తమిళ టీజర్‌ని త్రిష, మలయాళ టీజర్‌ని మంజూ వారియర్, హిందీ టీజర్‌ని తాప్సీ తమ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

ఇప్పటివరకు ఎలాంటి అంచనాలు లేని ఈ మూవీ.. టీజర్ తో ఒక్కసారిగా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది చిత్రయూనిట్. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమాతో మరోసారి భారతీయ సిని ఇండస్ట్రీలో కిర్తీ సురేస్ పేరు మారుమోగనున్నట్లు అన్పిస్తుంది. జూన్ 11న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయనున్నట్టు టీజర్‌ లో తెలిపారు. సంతోష్‌ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంటోంది.

Keerthy Suresh’s PENGUIN Movie Teaser released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News