Friday, May 3, 2024

నలుగురు కూతుళ్లపై తండ్రి అత్యాచారం?

- Advertisement -
- Advertisement -

 

Rape

 

తిరువనంతపురం: కేరళలో మల్లాపురం జిల్లా వాలన్ చెరు ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు కూతుళ్లపై అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ కామాంధుడికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి కూతుళ్లతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. కూతుళ్లపై పలుమార్లు తండ్రి అత్యాచారం చేసిన ఆరోఫణలు వస్తున్నాయి. కుటుంబం పరువు పోతుందనే అవమానంతో వాళ్లు బయటకు చెప్పలేదని సమాచారం. చిన్న కూతురు పాఠశాలలో కలవిడిగా లేకపోవడంతో టీచర్లు ఆరాతీశారు. దీంతో ఆమె తనపై తండ్రి అత్యాచారం చేశాడని చెప్పడంతో వాళ్లు స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో నలుగురు కూతుళ్లను ప్రశ్నించడంతో వాళ్లు జరిగిన విషయం మొత్తం పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ కామాంధుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆ నలుగురిని ఆస్పత్రికి తరలించారు.

Kerala Man arrested for raping 4 minor daughters
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News