Saturday, July 27, 2024

సీతాఫల్‌మండిలో మహిళల కిడ్నాప్ కలకలం

- Advertisement -
- Advertisement -

Kidnap

 

హైదరాబాద్ : మహిళలు కిడ్నాప్‌కు గురయ్యారనే సమాచారం నగరంలోని సీతాఫల్‌మండిలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. సీతాఫల్‌మండిలో శనివారం రాత్రి ఇద్దరు మహిళలు కారులో ఉన్న ఇద్దరు యువకులతో మాట్లాడుతున్నారు. ఇది చూసిన స్థానికులు మహిళలు కిడ్నాప్‌కు గురయ్యారని డయల్ 100కు ఫోన్ చేశారు. దీంతో కారులో ఉన్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇద్దరు మహిళలను విచారించగా మొబైల్ ఫోన్ చోరీకి గురైందని చెప్పి నమ్మించేందుకు యత్నించారు. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేయడంతో వారి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. వారిని మందలించడంతోపాటు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ చోరీకి గురికాలేదని, ఎలాంటి ఇబ్బందుల్లో లేరని పోలీసులు గుర్తించారు. అయినా కూడా మొబైల్ ఫోన్ చోరీకి గురైందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Kidnap of women in Sitaphalmandi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News