Friday, May 3, 2024

హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్’. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రియా సుమన్ కథానాయికగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనాథ్ బాదినేని మాట్లాడుతూ.. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు. నరేష్ అగస్త్య, అభినవ్, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్ అందరూ అద్భుతంగా నటించారు’ అని అన్నారు. అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. ‘ఈ సినిమా సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి కిస్మత్ అనే పేరు పెట్టడానికి కారణం ఆ పాత్రల్లో మస్త్ కిస్మత్ వుంది.భాను గారు, రాజు గారి కిస్మత్ కూడా బావుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ దేవ్, బెక్కం వేణుగోపాల్, భాను ప్రసాద్, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News