Friday, May 3, 2024

కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా

- Advertisement -
- Advertisement -

Koushik Reddy Resigns to Congress Party

హైదరాబాద్: హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సోమవారం కాంగ్రెస్ కు పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు తాను రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో అన్ని పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరుకు సిద్ధమవుతున్నాయి.ఇప్పటికే బిజెపి అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన ఈటల రాజేందర్ కు పోటీగా ఎవరిని నిలబెట్టాలని అధికార పార్టీ టిఆర్ఎస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరనున్నారు. ఈనెల 16వ తేదీన ఎల్ రమణతోపాట కౌశిక్ రెడ్డి కూడా ఒకేసారి సిఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

Koushik Reddy Resigns to Congress Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News