Sunday, June 16, 2024

ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు

- Advertisement -
- Advertisement -

ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ పాలనలో ఆరు నెలల్లోనే ఆవిష్కృతమయ్యాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నామని, విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నామని ఎక్స్ వేదికగా విమర్శించారు. కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్‌ఫార్మర్లు చూస్తున్నం..ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు -జనరేటర్ల మోతలు చూస్తున్నం…సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నం..ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నామని అన్నారు.

చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నం..పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నం..రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నం..తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నం..చివరికి ఇవాళ జోగిపేటలో విత్తనాల కోసం రైతుల మొక్కులు.. క్యూలైన్‌లో పాసుబుక్కులు చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని అన్నారు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News