Thursday, May 2, 2024

కాంగ్రెస్ పాలన చూస్తే… బిఆర్ఎస్ పాలన విలువ తెలుస్తుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. శనివారం కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కెటిఆర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలన చూస్తే… బిఆర్ఎస్ పార్టీ పాలన విలువ తెలుస్తుందన్నారు. హైదరాబాదీ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటేశారని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8 శాతమేనని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చాయన్నారు. ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. తమకూ నోరు ఉందని, వంద రోజుల వరకు తాము ఓపిక పడతామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News