Monday, May 13, 2024

లెజెండరీ టెన్నిస్ క్రీడాకారుడు అఖ్తర్ అలీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Legendary tennis player Akhtar Ali Passes away

 

కోల్‌కతా : భారత లెజెండరీ టెన్నిస్ ఆటగాడు జీషాన్ అలీ ఆదివారం కోల్‌కతాలో కన్ను మూశారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న 81 ఏళ్ల అలీ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కోల్‌కతాలోని తన నివాసంలో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమారుడు, ప్రస్తుతం భారత డేవిస్ కప్ కోచ్ జీషాన్ అలీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1939 జులై 5న జన్మించిన అఖ్తర్ అలీ 1955లో జాతీయ జూనియర్ చాంపియన్ కావడంతో పాటుగా జూనియర్ వింబుల్డన్ సెమీఫైనల్స్‌కు చేరడంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అఖ్తర్ అలీ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ట్వీట్‌లో సంతాపం తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News