news up date telugu
లక్నో: ఉత్తర ప్రదేశ్లో బిజ్నోర్ ప్రాంతంలో చిరుత పులిని గ్రామస్థులు తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిజ్నోర్ ప్రాంతంలో గ్రామస్థులపై చిరుతపులి గత సంవత్సరం నుంచి దాడి చేస్తోంది. సోమవారం మధ్యాహ్నం పాపపై చిరుత దాడి చేయడంతో ఆ బాలిక ఘటనా స్థలంలో మృతి చెందింది. గ్రామస్థులు సదరు చిరుతను తుపాకీతో కాల్చి చంపారని
బిజ్నోర్ డిఎంఆర్ పాండే తెలిపారు. చిరుత కళేబరాన్ని శవ పరీక్ష నిమిత్తం బిజ్నోర్ వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పాప కుటుంబానికి యుపి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
Leopard was shot dead by villagers in Bijnore
Bijnor:A leopard was allegedly shot dead by villagers after it killed a child, yday.Bijnor DM R Pandey says,Leopard was frequently attacking humans&had turned into man eater.Its carcass has been sent for post mortem. Childs family will be given an ex gratia of Rs 5 lakhs