Monday, May 6, 2024

భార్యను చంపి ఇంట్లో పాతి పెట్టి….

- Advertisement -
- Advertisement -

Murder

 

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జలాన్ జిల్లా ఓరాయ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యను చంపి తన ఇంట్లో పాతి పెట్టాడు. సంవత్సరం తరువాత భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి 2011లో వినీతను వివాహం చేసుకున్నాడు. ప్రమోద్ తన తల్లిదండ్రులతో కలిసి న్యూఢిల్లీలో ఉండేవాడు. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రమోద్, వినీత్ మనస్పర్థలు రావడంతో ప్రతి రోజు గొడవలు జరిగేవి. తన భర్త తనని వేధిస్తున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రమోద్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో దంపతులకు మహిళ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ప్రమోద్ తన పిల్లలను తల్లిదండ్రుల వద్ద ఢిల్లీలో ఉంటున్నారు.  ఓరాయ్ ప్రాంతంలో తన భార్యతో కలిసి ప్రమోద్ ఉంటున్నాడు. వినీత్ తల్లిదండ్రులు ప్రమోద్‌కు ఫోన్ చేసి తన కూతురుతో మాట్లాడాలని అడిగారు. వినీత్ ఓ ఇంటిలో పని చేస్తుందని ఆమెకు ఇప్పుడు ఫోన్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో వాళ్లకు అనుమానం కలిగింది.

వినీత్‌కు ఫోన్ చేద్దామంటే ఆమెకు ఫోన్ లేదు. ప్రమోద్ గత కొన్ని రోజుల నుంచి తన తల్లిదండ్రులతో మాట్లాడడం మానేశాడు. పలుమార్లు తన అల్లుడికి ఫోన్ చేసిన కూతురు సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానం రావడంతో  స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రమోద్‌పై వినీత్ తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రమోద్ తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో ఎస్‌పి జలౌన్ సతీష్ కుమార్ తన సిబ్బందితో ప్రమోద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తమ మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో తన భార్యను 2018 మే 18 చంపేశానని అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటి ఆవరణంలో పాతి పెట్టి అనంతరం సమాధిపై సిమెంట్ వేశానని తెలిపాడు. పోలీసులు ఐపిసి 302, 201 కింద కేసు నమోదు చేసి ప్రమోద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమాధిలో నుంచి ఆమె ఆస్తిపంజరం తీసి శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

UP Man arrested 1 year after killed wife, burying,man managed to mislead his in-laws about his wife’s death and ended all contact with his own family

 

UP Man arrested 1 year after killed wife, burying
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News