Saturday, June 21, 2025

ఎపిలో ఎల్ జి సిటి ఏర్పడేలా చేయాలి: నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి ఆర్థిక చరిత్రలో ఇది నిలిచిపోయే అంశం అని ఎపి మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎల్ జి రూ.5,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ ఎపికి మరిన్ని పెట్టుబడులు పెట్టే నమ్మకాన్ని తెచ్చిందని లోకేష్ చెప్పారు. శ్రీ సిటీలో ఎల్ జి సంస్థ భూమి పూజలో లోకేష్ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్ జి ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్ కు లోకేష్ భూమిపూజ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు ఎల్ జీ యూనిట్ కు మాత్రమే కాదు-ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నామని ప్రకటించామన్నారు. ఎల్ జి తమ సిస్టర్ సంస్థలను కూడా ఏర్పాటు చేసి, ఎపిలో ఎల్ జి సిటీ ఏర్పడేలా చేయాలని సూచించారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానయానం పెరిగేలా చేస్తామని లోకేష్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News