హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. న్యూఇయర్ వేడుకల కోసం మద్యం షాపులు, బార్లు, క్లబ్బులు, పబ్బులకు డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి 1గంట వరకు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. అయితే నిర్వాహకులు కరోనా నిబంధనలు పాటించాలని ఆబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కరోనా కొత్త స్ట్రేయిన్ దేశంలోకి ప్రవేశించడంతో అన్ని రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించాయి. మిగతా నిబంధనలు యధాతథంగా అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇవి సాధారణ ఉత్తర్వులేనని వేడుకలు చేసుకోవడం, గుంపులుగా ఉండడం నిషేధమని పోలీసులు తెలిపారు. సాధరణంగా నడుస్తున్న మాదిరిగానే పబ్బులు,క్లబ్బులు, హోటళ్లు, స్టార్ హోటళ్లు నడుస్తాయని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడానికి వీలులేదని పోలీసులు స్పష్టం చేశారు.