మహబూబాబాద్: ప్రేమకు అడ్డు చెప్పాడని తల్లి, ప్రియుడితో కలిసి కూతురు తండ్రిని చంపింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డిఎస్ఆర్ జెండాల్ తండాలో ధారావత్ కిషన్(40), కావ్య(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతురు పల్లవి తన ప్రియుడు సురేష్తో ఫోన్లో మాట్లాడుతుండగా తండ్రి ఆమెను మందలించాడు.
ప్రేమను తండ్రి అంగీకరించలేదని తల్లి కావ్య, చెల్లి, ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి కిషన్పై దాడి చేశారు. తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కిషన్ను తల్లి సాంకి మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లమని వైద్యులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఓ ఆస్పత్రికి కిషన్ను తల్లి తీసుకెళ్లింది. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. సాంకి ఫిర్యాదు మేరకు ఇద్దరు కూతుళ్లు, భార్య, భూక్య సురేష్, బోడ చందు, దేవేందర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.