Friday, April 26, 2024

పుట్టింటికి వెళ్లిన భార్య.. మనస్థాపంతో ఉరివేసుకుని భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిజాంసాగర్: నిజాంసాగర్ మండలం బంజాపల్లి గ్రామానికి చెందిన బండారి లక్ష్మణ్ (44) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు లక్ష్మణ్ గత కొన్ని రోజులుగా తాగుడుకు బానిసయ్యాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురై జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఒక పాప ఉందని తెలిపారు.

Man Attempt Suicide in House at Nizamsagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News