Saturday, July 27, 2024

భార్యకు భరణం…. పోలీసులు వచ్చారని టెర్రస్ పైనుంచి దూకిన భర్తకు గాయాలు

- Advertisement -
- Advertisement -

 

 

 

లక్నో: భార్యకు భరణం ఇవ్వకపోవడంతో పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చినప్పుడు భర్త రెండు ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అజయ్ కుమార్ (32) అనే వ్యక్తి గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నాడు. భార్యతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. భార్యకు 1.25 లక్షల రూపాయల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు అర్ధరాత్రి అజయ్ ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. పోలీసులు వచ్చేసరికి భయంతో పరుగులు తీసిన అజయ్ టెర్రస్ పైనుంచి కిందపడిపోవడంతో వెన్నెముక భాగం తీవ్రంగా గాయపడింది. అజయ్ ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని తెలిపారు. అజయ్ స్నేహితుడు ప్రదీప్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అజయ్‌ను పోలీసులు తీవ్రంగా వేధిస్తుండడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. గత కొన్ని రోజుల నుంచి పోలీసులకు కనపడకపోవడంతో అజయ్ కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. 2009లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యకు అజయ్ భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. భరణం ఇచ్చే ఆర్థిక స్తోమత అజయ్ వద్ద లేకపోవడంతో భార్యకు డబ్బులు చెల్లించడం లేదు.

 

Man ‘falls’ from terrace as police barge into house

 

Man ‘falls’ from terrace as police barge into house
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News