Saturday, July 27, 2024

కాలువలో పడిన కారు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: కల్వర్ట్‌ను ఢీకొట్టిన అనంతరం కాలువలోకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పలసా ఆస్పత్రికి తరలించారు. భువనేశ్వర్ కు చెందిన వ్యక్తులు విశాఖపట్నంలోని సింహాచలంలో దేవున్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. మృతులు త్రిలోచన్ జీనా, బనీతా జీనా, రీతు జీనా, ఆదర్శ్ జీనా, ప్రతాప్ జీనాగా గుర్తించారు.

 

Six Members Dead in Car fell into Canal in Vizag
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News