Tuesday, April 30, 2024

కరెంట్ షాక్‌తో చికెన్ సెంటర్ నిర్వహకుడు మృతి

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: గోదావరిఖని చంద్రబాబు కాలనీకి చెందిన కాంతాల గణేష్ (22) అనే చికెన్ సెంటర్ నిర్వహకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు గోదావరిఖని వన్‌టౌన్ ఎస్‌ఐ బి.సమ్మయ్య తెలిపారు. చికెన్ సెంటర్ వెనుక గల మోటార్‌ను ఆన్‌చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురి కాగా, అక్కడిక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతుని తల్లి కాంతాల సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News