Monday, May 13, 2024

మండుతున్న మణిపూర్- మౌనం వీడని ప్రధాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న పాలకులను గద్దె దించాలంటే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందనని రాజ్యసభ సభ్యులు,ఏ ఐ వై ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. సంతోష్ కుమార్ అన్నారు.అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) జాతీయ వర్క్ షాప్ రెండవ రోజు సెషన్ హిమాయత్ నగర్ లోని సత్య నారాయణ రెడ్డి భవన్లో జరిగింది. ఈ సెషన్ కు ముఖ్య అతిధిగా సంతోష్ కుమార్ హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా సిపిఐ రాజ్యసభ సభ్యులు,ఏ ఐ వై ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మణిపూర్లో నెలకొన్న సంక్షోభం రాజకీయ సమస్య అని అందువల్ల పరిష్కారం కూడా రాజకీయంగానే చేయాలని వారు డిమాండ్ చేశారు. తక్షణం హింసను ఆపాలని, శాంతిని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మణిపూర్ పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వం అనుసరించిన రాజకీయాల మూలంగానే వివిధ జాతుల మధ్య హింస జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లోని అన్ని రాజకీయ పార్టీలను తక్షణం సమావేశపరచాలన్నారు.నిర్వాసితులైన వేలాదిమందికి ప్రత్యేక ప్యాకేజీని తక్షణం మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా మణిపూర్లో టెర్రరిస్టు చర్యలను తక్షణం నిలిపివేయాలి. ఇంకా అనేక సమస్యలను పరిష్కరించాలని, డబుల్ ఇంజన్ సర్కారుగా చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజల విభజన విధానం మూలంగానే మణిపూర్ లో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

ప్రజల మధ్య విభజనకు పాల్పడడంతో వారి మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయని, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకుగాను ప్రజల మధ్య చీలికలు ఏర్పడ్డాయని వారు ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మణిపూర్ ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. ఇక్కడ చోటుచేసుకున్న హింసాయుత ఘర్షణ రాజకీయ, సామాజిక పరమైనదని కేవలం శాంతిభద్రతల సమస్యకాదని స్పష్టంచేశారు. ఈ హింసాకాండలో బాధితులను, హింసకు బాధ్యులైన వారి ప్రతినిధులను, రాజకీయ పార్టీలను తక్షణం సంప్రదించి ప్రజల మధ్య ఏర్పడిన వైరుధ్యాలను, విద్వేషాలను రూపుమాపాలని. అందరి అభిప్రాయాలను తెలుసుకుని సంక్షోభానికి రాజకీయపరమైన పరిష్కారం కనుగొని ప్రజల విశ్వాసాన్ని పొందాలని వారు సూచించారు.తద్వారా రాష్ట్రంలో సాధారణ పరిస్థితిని, శాంతిని నెలకొల్పాలన్నారు.

అన్ని వర్గాల ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలన్నారు.ప్రపంచ శాంతి దూతగా అభివర్ణించుకునే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాణిపూర్ లో శాంతిని నెలకొల్పడానికి ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని వారు ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసం ప్రశాంత మాణిపూర్ లో విద్వేషాలు రెచ్చగొట్టబడ్డాయో ప్రజలకు మోడీ వివరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సుఖేందర్ మహేసరి, తిరుమలై రామన్ లు సంయుక్తంగా మాట్లాడుతూ కార్పొరేట్, మతోన్మాదశక్తులు అధికారంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు.

అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్, డిజిటలీకరణ వంటి అంశాలతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మన హక్కుల కోసం, ప్రజల భవిష్యత్ కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.ఏ ఐ వై ఎఫ్ సైద్ధాంతిక అవగాహన కలిగిన భౌతిక సంఘమన్నారు. అదే విధంగా ఆదివారం వర్క్ షాప్ లో కులం, మతం – సామాజిక న్యాయం అనే అంశంపై అల్ ఇండియా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సభ్యులు యుగల్ రాయులు, సోషల్ మీడియాలో యువజన సంఘ పాత్ర అనే అంశంపై అల్ ఇండియా సోషల్ మీడియా డిపార్ట్మెంట్ సభ్యులు దినేష్ రఘునాథ్ బోధించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ జాతీయ ఆఫీస్ బేరర్స్ టిటి. జిస్మాన్, లెనిన్ బాబు, అరుణ్, విక్కీ, హరీష్ బాల, భారతి, కరంవీర్ కౌర్,… AIYF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నిర్లకంటి శ్రీకాంత్, లింగం రవి, యుగంధర్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సల్మాన్ బైగ్, టి. సత్య ప్రసాద్ లతో పాటు 23రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News