- Advertisement -
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్లు ఈనెల 13వ తేదీన హైదరాబాద్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తాజా రాజకీయ అంశాలతో పాటు రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు రెండు రాష్ట్రాల సిఎంలు సమావేశమై పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. ఎపిలో మూడు రాజధానుల నిర్మాణంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న కీలక సమయంలో వారిద్దరి భేటికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Meeting of Telugu chief ministers KCR and Jagan
- Advertisement -