Friday, April 26, 2024

బాక్సర్ హుస్సాముద్దీన్‌ను అభినందించిన మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన నిజామాబాద్ జిల్లా వాసి హుస్సాముద్దీన్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో మంత్రి వేములను హుస్సాముద్దీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుస్సాముద్దీన్‌కు మంత్రి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరింతగా రాణించాలని నిజామాబాద్ జిల్లాను, తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని మంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News