Thursday, April 25, 2024

కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లకు 12 నెలల వేతనం మంజూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లకు 12 నెలల వేతనాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చోంగ్తు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నిధులు విడుదలయ్యాయి. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల వేతనలు మంజూరు చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర యుటిఎఫ్ హర్షం వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News