Monday, April 29, 2024

వేల్పూర్‌కు బయలుదేరిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కు బయలుదేరారు. నిన్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మరణించారు. ఇవాళ జరగనున్న అంత్యక్రియలకు సిఎం కెసిఆర్ హాజరుకానున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మకు సిఎం నివాళులు అర్పించనున్నారు. వేములతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కెసిఆర్ పరామర్శించనున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తండ్రి వేముల సురేందర్ రెడ్డి కూడా ఆనారోగ్యంతో ఏడేళ్ల క్రితం మరణించారు.

అప్పటి నుంచి తల్లి మంజుల మానసికంగా కృంగి పోయింది. ఆనారోగ్యం పాలైంది. గతంలో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. దీంతో అప్పట్నుంచి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. రెండు నెలలుగా హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించి హాస్పిటల్‌లోనే మృతి చెందారు. వేముల ప్రశాంత్‌రెడ్డికి తల్లి మృతి చెందటంతో బాల్కొండ నియోజక వర్గంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన స్వగ్రామం వేల్పూరు మండల కేంద్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

సిఎం కెసిఆర్ సంతాపం
మంజులమ్మ మృతి పట్ల సిఎం కెసిఆర్, స్పీకర్ పోచారం, మంత్రి కెటిఆర్,ఎంఎల్‌సి కవితలు సంతాపం తెలియజేశారు. వీరితో పాటు మంత్రులు,ఎంపిలు, సోషల్ మీడియా వేదికగా సంతా పంతెలిపారు. మంజులమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News